‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ అదిరిందిగా..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు.. ఇప్పటికే సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు చిత్ర టిజర్ ని విడుదల చేసి ఆ అంచనాలను మరింత పెంచేసింది చిత్ర బృందం. అలాగే ఈ సినిమా తాజా టీజర్ రిలీజైందని మహేశ్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈ సంక్రాంతి మరింత చిరస్మరణీయం అవుతుందని పేర్కొన్నాడు. కాగా, ఈ టీజర్ లో మహేశ్ బాబు పంచీ డైలాగ్స్ తో అదరగొట్టాడు.

“భయపడేవాడే బేరానికి వస్తాడు… మనదగ్గర బేరాల్లేవమ్మా….” అంటూ తనదైన శైలిలో పలికిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. “గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు” అంటూ విజయశాంతి, “ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు” అంటూ ప్రకాశ్ రాజ్ పలికిన సంభాషణలు ఆడియన్స్ లో చొచ్చుకుపోతాయనడంలో సందేహంలేదు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news