నీతులు చెప్పే మహేష్ చేసే పనేనా ఇది..!

-

సూపర్ స్టార్ మహేష్ వివాదాలు దూరంగా ఉంటాడు. తోటి స్టార్స్ కూడా మహేష్ అంటే ఎప్పుడు పాజిటివ్ గానే స్పందిస్తారు. అలాంటి మహేష్ కు పోలింగ్ డే నాడు చేసిన పనిని అందరు అవాక్కయ్యేలా చేస్తుంది. మహేష్ పోలింగ్ కు వచ్చి వెళ్లిన పద్ధతి చూస్తే అందరికి అర్ధమవుతుంది. కారులోంచి దిగిన మహేష్ ను మీడియా వెంబడించినా పట్టించుకోలేదు. అంతేకాదు పోలింగ్ స్టేషన్ లో అప్పటికే బారులు తీరి ఉన్న జనం పక్కన డైరెక్ట్ గా వెళ్లి మహేష్, నమ్రతలు ఓటు వేసి వచ్చారు.

కారు దిగిన దగ్గర నుండి కారు ఎక్కేదాకా మహేష్ ను మీడియా చుట్టే ఉందని చెప్పొచ్చు. అయితే మహేష్ మాత్రం వారికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. మహేష్ తీరుకి అందరు షాక్ అవుతున్నారు. మీడియాతో మాట్లాడలేదని ఓ పక్క.. డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటేసి వచ్చాడని మరో పక్క నెగటివ్ విమర్శలు చేస్తున్నారు. భరత్ అనే నేను సినిమాలో ఎకౌంటబులిటీ మీద భారీ డైలాగులు కొట్టిన మహేష్ సాటి మనిషిగా లైన్ లో వెళ్లి ఓటు వెయ్యకుండా ఇలా ఎందుకు చేసినట్టో అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

అయితే మరో పక్క ఎన్.టి.ఆర్ తన ఫ్యామిలీతో లైన్ లో నిలబడి ఓటు వేయగా. చిరంజీవి లాంటి వారు కూడా క్యూలో వెళ్లి ఓటు వేసి రావడం జరిగింది. రాం చరణ్ మాత్రం ఓటు వేయలేదని తెలుస్తుంది. అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ శబరి యాత్రలో ఉన్న కారణం చేత ఓటు వేయడానికి వీలు కలగలేదు. మరి నెటిజెన్స్ మహేష్ పై చేస్తున్న ఈ కామెంట్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version