మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే సంతోషిస్తారా?: చిరంజీవి

-

ఇవాళ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్బంగా ఏపీ డీజీపీ కార్యాలయంలో దీనిపై వెబినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ” నేటి యువత డ్రగ్స్ మత్తులో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మనిషి జన్మ అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అని అన్నారు. అలాంటి అందమైన జీవితాన్ని మత్తు పదార్థాలతో అస్తవ్యస్తం చేసుకోవడం అవసరమా? అంటూ ప్రశ్నించారు.

కొన్ని క్షణాల ఆనందం కోసం నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకోవడం ఎంతవరకు సమంజసం? అన్నారు. డ్రగ్స్ కి బానిసలైన మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించండి. రేపు మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే సంతోషిస్తారా? ఏదేమైనా యాంటీ డ్రగ్ ప్రచారానికి ముందుకొచ్చిన పోలీసు డిపార్ట్ మెంట్ ను, డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అభినందిస్తున్నాను” అంటూ ప్రసంగించారు మెగాస్టార్ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news