ఏడు నెలల తర్వాత కెమెరా ముందుకు మెగా హీరో తేజ్.. కొత్త సినిమా ఓపెనింగ్..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి అందరికీ విదితమే. ‘రిపబ్లిక్’ ఫిల్మ్ రిలీజ్ కంటే ముందరే వినాయక చవితి రోజున సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్డ్ సమీపంలో ఐకియా వైపు వెళ్తుండగా బైక్ స్కిడ్ అయి పడిపోయాడు.ఈ ప్రమాదంలో తేజుకు తీవ్రగాయాలయ్యాయి. చావు అంచుల వరకు వెళ్లాడని అప్పట్లో వార్తలొచ్చాయి కూడా. మెడికవర్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ అనంతరం ఆయన్ను జూబ్లిహిల్స్ ఆస్పత్రికి తరలించారు.

దీపావళి వరకు తేజు పూర్తిగా కోలుకున్నాడు. అయితే, కొంత కాలం పాటు రెస్ట్ తీసుకోవాలన్న డాక్టర్స్ సూచన మేరకు తేజు ఏడు నెలల పాటు ఇంటి పట్టునే ఉన్నాడు. ఇటీవల పలు కార్యక్రమాలకు హాజరవుతున్న సాయి ధరమ్ తేజ్..తాజాగా తన నెక్స్ట్ ఫిల్మ్ ‘ఎస్ డిటి 15’ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో హీరోకు మూవీ యూనిట్ సభ్యులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరలవుతున్నాయి.

కార్తీక్ దండు దర్శకత్వంలో చిత్రం తెరకెక్కుతుండగా, ఇది నేచురల్ థ్రిల్లర్ అని పేర్కొన్నారు మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ప్లస్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో కలిసి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచి స్టార్ట్ అయింది. సెట్ లో ఉన్న గుడిలో పూజ చేసే షాట్ తో సినిమా స్టార్ట్ అయింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు మూవీ యూనిట్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ చిత్రంలో తేజు చివరగా కనిపించారు. ఇందులో పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ రోల్ ను తేజు ప్లే చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news