Acharya: అఫీషియల్: ‘ఆచార్య’ రన్ టైమ్ లాక్డ్..సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇదే

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం‘ఆచార్య’. ఈ నెల 29న పిక్చర్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ నెల 23న తెలంగాణలోని హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చేసింది.

ఈ చిత్రం సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ ఫిల్మ్ కు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 34 నిమిషాలతో సినిమా విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో తండ్రీ తనయులు చిరంజీవి- రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ చిత్రానికి ‘ధర్మస్థలి’ పరిచయం విషయమై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి. ఈ పిక్చర్ లో రామ్ చ రణ్ యాక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ కావడం విశేషం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా, చిరంజీవి సరసన పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్ కు జోడీగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news