స్టార్ హీరోల‌ వార‌సుల‌తో శంక‌ర్ భారీ ప్రాజెక్ట్!

-

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ `భార‌తీయుడు-2` డైలామాలో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సినిమా ఉందా? క‌్యాన్సిల్ చేసారా? అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. ఆ మ‌ధ్య బడ్జెట్ పెరిగిపోయింద‌న్న‌కార‌ణంగా బ్రేక్ ప‌డినా.. త‌ర్వాత మ‌ళ్లీ సెట్ర‌యిట్ అయిన‌ట్లు ప్రచారం సాగింది. అప్ప‌టి నుంచి తిరిగి షూటింగ్ కు వెళ్లారా? లేదా? అన్న దానిపై ఎలాంటి వార్త రాలేదు. తాజాగా శంక‌ర్ ఇద్ద‌రు స్టార్ హీరోలు విజ‌య్ విక్ర‌మ్ త‌న‌యుల‌తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం ఊపందుకుంది. సౌత్ లో రెండు, మూడు లాంగ్వేజ్ ల్లో దీన్ని తెర‌కెక్కించాల‌నుకుంటున్నారుట‌. ప్ర‌స్తుతం విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్ సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు.

Shankar Directed to two star Heroes Sons

టాలీవుడ్ లో భారీ విజ‌యం సాధించిన సినిమా కావ‌డంతో రెట్టింపు అంచ‌నాల‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక విజ‌య్ త‌న‌యుడు జేస‌న్ ఇప్ప‌టికే ల‌గు చిత్రాల‌తో సుప‌రిచితుడే. హీరో వ‌య‌సు వ‌చ్చేసింది. అయితే జేస‌న్ క్రియేటివ్ రంగంవైపు ఎక్కుగా ఆస‌క్తి చూపిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే షార్ట్ ఫిల‌మ్మ్స్ ను డైరెక్ట్ చేసాడు. కానీ తండ్రి పెద్ద హీరో కాబ‌ట్టి ముందు గా అక్క‌డ ల‌క్ ను చెక్ చేసుకున్న త‌ర్వాత మేకింగ్ వైపు ఆస‌క్తి చూపించ‌నున్నాడు. ఈ నేప‌థ్యంలోనే శంక‌ర్ ఇద్ద‌ర్నీ ఒకే ప్రేమ్ లో చూపించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. శంక‌ర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వెనుక పెద్ద కార‌ణం ఉంద‌ని కూడా స‌ద‌రు వెబ్ సైట్ పేర్కొంది.

`రోబో` తర్వాత శంక‌ర్ చేసిన భారీ బ‌డ్జెట్ సినిమాల‌న్నీ స‌రైన ఫ‌లితాలు సాధించ‌లేదు. ఫ‌లితంగా నిర్మాత‌లు న‌ష్టాల‌ను చూడాడాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. గ‌తేడాది విడుద‌లైన 2.ఓ సైతం క‌మ‌ర్శియ‌ల్ గా స‌క్సెస్ ను అందుకోలేక‌పోయింది. భార‌తీయుడు 2 ఆగిపోవ‌డానికి కూడా ఈ ప‌రాజ‌యాలు ఓ కార‌ణంగా మొద‌టి నుంచి వినిపిస్తున్నాయి. వీట‌న్నింటికి బ‌ధులివ్వాలంటే కొత్త వాళ్ల‌తో సినిమా చేసి హిట్ కొడితేనే అంద‌రి నోళ్ల‌కు తాళం వేయించొచ్చు అన్న క‌సితో యంగ్ హీరోల‌పై స‌ద‌రు వెబ్ సైట్ ప‌డిన‌ట్లు పేర్కొంది. మ‌రి ఇందులో నిజ‌మెంత‌? అన్న‌ది తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news