మెగాస్టార్ ని చంపేసిన శోభాడే…… నెటిజన్ల అక్షింతలు!

-

సెలబ్రిటీలు అనబడేవాళ్ళు సోషల్ మీడియా లో పెట్టె పోస్ట్ లు ఒక్కోసారి మంచి ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టి, మరింత స్టార్స్ ని చేస్తుంటాయి. ఇదే క్రమంలో మరోసారి వివాదాలను కూడా అంతే బలంగా తెచ్చిపెడతాయి. అయితే… స్పందించే విషయంలో పూర్తి సమాచారం లేకుండా స్పందించి వివాదాలను కొనితెచ్చుకున్నారు ప్ర‌ముఖ కాల‌మిస్ట్ శోభాడే! చిరంజీవి చనిపోయారు అంతే… ఏ చిరంజీవి, ఏ ఇండస్ట్రీ కి చెందిన చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవా, హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవా అనేది ఆమె ఆలోచించలేదు.. ఫలితం సరికొత్త వివాదం!

ఇండస్ట్రీ మరో తారని కోల్పోయింది, వారి కుటుంబానికి నా ప్రాగాడ సానుభూతిని తెలియచేస్తున్నాను అంటూ… మెగా స్టార్ చిరంజీవి ఫోటోని పోస్ట్ చేసేశారు ప్రముఖ కాలమిస్ట్ శోభాడే! దీనితో మెగా ఫ్యాన్స్ ఆమెకు చుక్కలు చూపించారు.. ఆమాత్రం జ్ఞానం లేకుండా ఎలా పోస్ట్ చేస్తారంటూ ఫైరయ్యారు. దీంతో నెటిజన్ల అక్షింతలతో శోభాడే వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌కు మేనల్లుడు అయిన చిరంజీవి స‌ర్జా (39) గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత మూడు, నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని వైద్యులు తెలిపారు. కాగా… 1980 అక్టోబరు 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా.. కెరీర్‌ తొలినాళ్లలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా చేశారు. ఆ తర్వాత నటుడిగా మారి 2009లో “వాయుపుత్” అనే చిత్రంతో హీరోగా కెరీర్‌ ను ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news