రాజమౌళి కి షాకిచ్చిన శ్రియ శరణ్ ..ఆర్ ఆర్ ఆర్ న్యూస్ లీక్ ..?

-

ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 400 కోట్ల భారీ బడ్జెత్ తో తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమా గురించి మన తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు పక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాం చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతా రామరాజు పాత్రను టీజర్ తో రివీల్ ఎప్పుడు చేశారో అప్పటి నుంచి ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

 

అయితే ఆ తర్వాత తారక్ పోషిస్తున్న కొమరం భీం పాత్రని రివీల్ చేస్తారని అందరు ఎంతో ఆశ పడ్డారు. అందుకే ఎన్.టి.ఆర్ బర్త్ డే కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. కాని ఎన్.టి.ఆర్ బర్త్ డే వచ్చింది .. వెళ్ళిపోయింది. చివరికి ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరికి నిరాశే మిగిలింది. లాక్ డౌన్ కారణంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకున్న భీం టీజర్ రాలేదు.

కాని ఈ సినిమా నుండి ఒక ఫ్రెష్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో నటించిన శ్రియ శరణ్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు తనే అనౌన్స్ చేసి ఆర్ ఆర్ ఆర్ బృందానికి షాకిచ్చింది. పొరపాటున చెప్పిందో లేక అఫీషియల్ గా రివీల్ చేసిందో గాని ఆర్ ఆర్ ఆర్ బృందం ఇప్పటి వరకు సీక్రెట్ గా ఉంచిన విషయాన్ని బయట పెట్టేసింది శ్రియ. ఈ సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఇలా శ్రియ న్యూస్ లీక్ చేయడం కరెక్టేనా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news