సొనాక్షి సిన్హా టార్గెట్ చేసింది నెటిజెన్స్ ని కాదట .. ఆ స్టార్ హీరోలనట …?

-

బాలీవుడ్ లో కనపడే విధంగా కాంట్రవర్సీలలో కనిపించేది కంగన సిస్టర్ అయితే కనిపించకుండా ఎవరైనా తేడా గా మాట్లాడినా, కామెంట్స్ చేసినా ఏకిపారేసేది బాలీవుడ్ బ్యూటి సోనాక్షి సిన్హా. బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుజ్ఞ సిన్హా గారాల పట్టి అయిన సోనాక్షి సిన్హా బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా దబాంగ్ తో గ్రాండ్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా సెటిలయింది.

 

అంతేకాదు తనని ఎవరన్న బొద్దుగుమ్మ అన్నా, తన తండ్రి గురించి ఎవరన్నా చిన్న కామెంట్ చేసినా ఉతికి ఆరేస్తుంది. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కి పబ్లిక్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మీడియావాళ్ళు ఏవైనా తిక్క ప్రశలు వేసినా తిరిగి కౌంటర్ ఇవ్వడం లో సోనాక్షి అసలు ఆలోచించదు. ఇక బాలీవుడ్ హీరోలు గాని హీరోయిన్స్ గాని అతి చేసినా అలానే రియాక్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో సోనాక్షి సిన్హా మరోసారి బాలీవుడ్ లో కొంతమందిని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి భారిన పడకుండా ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చేయూత‌నిచ్చేందుకు సినీ సెల‌బ్రిటీలు, పారిశ్రామిక‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు…ఇలా అనేక మంది పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కొంతమంది అకౌంట్ కి నేరుగా భారీ మొత్తం లో అమౌంట్ ని పంపించారు.

అయితే కొంతమంది ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో ప్రజలకి సహాయం చేయడానికి ముందుకు రాని సెలబ్రిటీస్ గురించి కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా టాలీవుడ్ ఒక సీనియర్ నటుడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్స్ గురించి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ గురించి కామెంట్స్ చేశారు. దాంతో ఈ కామెంట్స్ బాలీవుడ్ బ్యూటి సోనాక్షి సిన్హా రియాక్టయింది.

కొంతమంది తాము చేసే మంచి పనుల గురించి బయటకు చెప్పుకోరు. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మాత్రం చేసేది కొంత చెప్పుకునేది చాటడంత .. ఇదంతా పబ్లిసిటి కోసమే అంటు మండిపడింది. అయితే తను ఇలా కౌంటర్ ఇచ్చింది కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ గురించే అని ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఏదేమైనా సోనాక్షి సిన్హా మాటలు పెద్ద దుమారమే రేపాయి.

Read more RELATED
Recommended to you

Latest news