సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్‌ కొత్త మూవీ

-

మంచి క‌థ‌ల్ని ఎంపిక చేసుకుంటాడ‌నే పేరున్న సుహాస్‌ ‘బేబి’తో విజ‌యాన్ని అందుకున్న విరాజ్ అశ్విన్‌, ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’ మొద‌లుకొని ప‌లు చిత్రాల‌తో మంచి న‌టుడిగా గుర్తింపు పొందిన కార్తీక్‌ర‌త్నం… క‌థ‌ల ఎంపిక‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన అభిరుచి ఉంద‌ని చాటుతున్న రుహానీ శ‌ర్మ కలిసి నటించిన సినిమా శ్రీరంగ నీతులు. ప్రవీణ్‌ కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక తాజాగా తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో సడెన్గా స్ట్రీమింగ్‌ అవుతోంది.

మే 30వ తేదీన భవానీ హెచ్డీ మూవీస్ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందుబాటులోకి రానున్నట్లు సదరు ఛానల్‌ ప్రకటించడంతో ఓటీటీ డీల్‌ జరగలేదేమో అంతా అనుకున్నారు. ఈ క్రమంలో బుధవారం నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‌ మొదలైంది. ఇక ఈ సినిమాలో సుహాస్, కార్తిక్ రత్నం, రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్లతో పాటు రాగ్ మయూర్, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, దేవి ప్రసాద్ వంటి ఇతర నటులు నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news