ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!

-

హీరో ప్రభాస్‌ హీరోగా చేసిన ఆది పురుష్ సినిమా నిన్న రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద ఆది పురుష్ మేనియా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అభిమానుల కోలాహాలం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఐమాక్స్ థియేటర్ వద్ద ఒక వ్యక్తి ఆది పురుష్ సినిమా బాగాలేదని యూట్యూబ్ ఛానళ్లతో చెప్పాడు. దీంతో అభిమానులు అతన్ని చితక్కొట్టారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే.. ఈ వీడియోపై శ్రీరెడ్డి స్పందించారు. అంతేకాదు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు వార్నింగ్‌ కూడా ఇచ్చారు శ్రీ రెడ్డి. అరేయ్, ప్రభాస్ ఫ్యాన్స్ కి దమ్ము ఉంటే వెళ్ళి ఆ దర్శకుడు ఓం రౌత్‌ ను కొట్టండని చురకలు అంటించారు. అంతేకానీ ఐ మాక్స్ దగ్గర పిల్లల మీద కాదు మీ ప్రతాపం చూపేంచేందంటూ రెచ్చిపోయింది. రామాయణం తియ్యాలంటే అది రాజమౌళి నే అంటూ పోస్ట్‌ పెట్టింది ఈ బ్యూటీ.

Read more RELATED
Recommended to you

Latest news