SSMB28 : మహేష్ బాబు కోసం బ్యాంకాక్ వెళ్లిన పూజా హెగ్డే

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి.

ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. అయితే.. ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ ను ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేసింది. ఇక ఈ షూటింగ్‌ కోసం బ్యాంకాక్‌ వెళుతున్నట్లు ఓ పోస్టు చేసింది పూజా. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ గా మారింది. 1 నెల, 3 ఖండాలు, 4 నగరాలు వెళుతున్నట్లు ఆ పోస్ట్‌ కు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది బుట్టబొమ్మ.

 

Read more RELATED
Recommended to you

Latest news