సుధీర్ బాబు వెనక్కి తగ్గాడు

-

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుధీర్ బాబు ఈమధ్య సోలో హిట్లు కొడుతున్నాడు. సమ్మోహనం సినిమాతో తన టాలెంట్ చూపించిన సుధీర్ బాబు ప్రస్తుతం నన్ను దోచుకుందువటే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సుధీర్ బాబే నిర్మించడం విశేషం. అసలైతే ఈ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని అదే రోజు అక్కినేని ప్రేమ జంట చైతు, సమంత తమ సినిమాలతో వస్తున్నారు.

భార్యా భర్తలైనా సరే ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ చేస్తున్నారు నాగ చైతన్య, సమంతలు. చైతు శైలజా రెడ్డి అల్లుడిగా వస్తుంటే సమంత యూటర్న్ అంటూ ఓ థ్రిల్లర్ కథతో వస్తుంది. ఈ రెండు సినిమాల మధ్య తన సినిమా ఎందుకు అని అనుకున్నాడో ఏమో సుధీర్ బాబు తన సినిమాను సెప్టెంబర్ 21కి వాయిదా వేసుకున్నాడు.

ఆర్.ఎస్ నాయుడు డైరెక్ట్ చేస్తున్న నన్ను దోచుకుందువటే సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఈమధ్య రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి రిలీజ్ డెట్ వాయిదా వేసుకున్న సుధీర్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news