బాలయ్య ఫాన్స్ కి ఖుషీ ఇచ్చిన జూనియర్ ఎన్‌టి‌ఆర్

-

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న చిత్రం ఎంత మంచి వాడవురా. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫాన్స్ భారీగా తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, తన అన్న కళ్యాణ్ రామ్ ఎన్నో,

పాత్రలు చేసారని, మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు చేసారు గాని ఒక కోరిక మాత్రం ఇన్నాళ్ళు గా తీరలేదని, కుటుంబ కథా చిత్రం చేయడం తన కోరిక అని, ఆ కోరికను ఇప్పుడు సతీష్ వేగేశ్న నెరవెర్చారన్నారు. అదే విధంగా నిర్మాత కృష్ణ ప్రసాద్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్, బాబాయ్ తో ఎన్నో సినిమాలు ఆయన చేసారని, ఆయన తమకు ఒక కుటుంబ సభ్యుడు అని,

నిర్మాత కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ఎన్టీఆర్ నుంచి రాగానే అభిమానులు జై బాలయ్య అంటూ నినదించారు. అలాగే ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, దర్బార్ సహా ఇతర సినిమాలు కూడా సంక్రాంతికి మంచి విజయం సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక అభిమానులు అందరూ ఇళ్ళకు జాగ్రత్తగా వెళ్లి ఈ ఆనందాన్ని తల్లి తండ్రులకు, కుటుంబ సభ్యులకు ఇవ్వాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news