‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడంటే….??

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అఫీషియల్ టీజర్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై ఎంతో భారీగా నిర్మితం అవుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.

ఇదిలా ఉంటె, ఇక నేడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఆ వార్త ఏంటంటే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి మొదటి వారంలో ఎంతో గ్రాండ్ లెవెల్లో జరపాలని నిర్ణయించారట. సినిమా యూనిట్ తో పాటు పలువులు టాలీవుడ్ సినిమా రంగ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు టాక్. ఇక ఈ ఫంక్షన్ కోసం ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా ఆడియో ఫంక్షన్ జరిగిన రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలోనే ఈ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారట.

 

అందుకోసం పలు పర్మిషన్లు కూడా తీసుకునేందకు సినిమా యూనిట్ సిద్ధమయినట్లు సమాచారం. మహేష్ బాబు మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, సంగీత, బండ్ల గణేష్, శ్రీనివాస రెడ్డి, హరితేజ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీ చేయనుంది సినిమా యూనిట్….!!

Read more RELATED
Recommended to you

Latest news