సినిమాల్లో ఇకపై అలాంటి సీన్స్ ఉండకూడదు :సుప్రీంకోర్టు

-

సినిమాలు, దృశ్య మాధ్యమాల్లో పలు సన్నివేశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ సినిమా ‘ఆంఖ్‌ మిచోలీ’లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని నిపున్ మల్హోత్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు.

దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక మార్గదర్శకాలు సూచించింది. దివ్యాంగుడు, స్పాస్టిక్ వంటి పదాలు వారిని సామాజిక వివక్షకు గురయ్యేలా చేస్తాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సినిమా స్క్రీనింగ్కు అనుమతించే ముందు సర్టిఫికేట్ ఇచ్చే సీబీఎఫ్సీ నిపుణుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది. దివ్యాంగులపై వాస్తవాలను చిత్రీకరించడానికి దృశ్య మీడియా కృషి చేయాలని పేర్కొన్న సీజేఐ ధర్మాసనం.. అలాగే దివ్యాంగుల సవాళ్లను మాత్రమే కాకుండా వారి విజయాలు, ప్రతిభ, సమాజానికి చేసిన సేవను చూపించాలని అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Latest news