ట్రెండ్ ఇన్: ఎస్‌వీ‌పీ మేనియా ఆగయా..బాక్సాఫీసుపై ‘సర్కారు వారి పాట’ వేట

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ‘మహానటి’ కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ పిక్చర్ ఈ నెల 12న విడుదల కానుంది. మహేశ్ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ పిక్చర్ లో కనిపించారు. ఈ క్రమంలోనే మహేశ్ ను చూసేందుకు మహేశ్- కృష్ణ అభిమానులు రెడీ అయిపోయారు.

థియేటర్ల వద్ద సందడి షురూ అయింది. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ డెఫినెట్ గా హిట్ అవుతుందని మహేశ్ అశేష అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘సర్కారు వారి పాట’ పిక్చర్ పోస్టర్, వీడియోలు, మహేశ్ బాబా ఫొటోలు, కటౌట్లు షేర్ చేసి సందడి చేస్తున్నారు.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా అభిమానులు #SVPMania హ్యష్ ట్యాగ్ తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అవడంతో పాటు మూవీ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం బాక్సాఫీసు నుంచి డబ్బుల రికవరీకి బయలు దేరింది. చూడాలి ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news