“స్వాతిముత్యం” మూవీ ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

-

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వాతిముత్యం.

ఓ అమ్మాయికి మరియు ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు అలాగే జరిగే సంఘటనలు ఇవన్నీ స్వాతిముత్యం సినిమాలో చూపించనున్నారు.

ప్రముఖచిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేయనుంది చిత్ర బృందం. కాగా, దసరా కానుకగా అంటే అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news