#AK63 : 24 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీ కడుతున్న అజిత్-టబు

-

హీరోయిన్గా.. సహాయ నటిగా.. కొన్నిసార్లు విలన్గా.. దాదాపుగా 30 ఏళ్లుగా తనదైన నటనతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం టబు బాలీవుడ్ను ఏలేస్తోంది. వరుస సినిమాలు, వెబ్సిరీస్లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. వర్సటైల్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ డిఫరంట్ రూట్లో వెళ్తోంది. ఇక ఈ భామ తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అది కూడా తమిళ్ మూవీకి.

అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ప్రముఖ కథానాయకుడు అజిత్‌ ‘ఏకే 63’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అజిత్కు జోడీగా టబు నటిస్తున్నట్లు సమాచారం. ఇక విలన్గా అరవింద్ స్వామి నటించనున్నట్లు తెలుస్తోంది. మరో కీలక పాత్రలో ఎస్‌.జె.సూర్య కనిపించనున్నారు. పూర్తి వివరాల్ని త్వరలో అధికారికంగా చిత్రబృందం ప్రకటించనుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అయితే అజిత్ టబు 24 ఏళ్ల కిందట ‘ప్రియురాలు పిలిచింది’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఈ జంట లవ్ స్టోరీ అన్నా.. వీరి కెమిస్ట్రీ అన్నా ఇప్పటికీ ప్రేక్షకులు ఫిదా అవుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ జంట వెండితెరపై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోందని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news