లాక్డౌన్ హ్యాంగోవర్ తీర్చడానికి తేజస్వి కమిట్మెంట్ తో వస్తుంది..

-

తేజస్వి మాదివాడ.. తెలుగు వెండితెర మీద చిన్న చిన్న పాత్రల ద్వారా పరిచయమై, ఆ తర్వాత హీరోయిన్ గానూ మెరిసింది. ఐతే హీరోయిన్ గా తేజస్వి సరైన విజయాన్ని అందుకోలేక పోయింది. సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉండే ఈ భామ, తాజాగా ఓ ప్రకటన చేసింది. కమిట్మెంట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తేజస్వి, ఆ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. అన్ లాక్ దశలో ఉన్నప్పటికీ లాక్డౌన్ లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా.. అంటూ ఈ టైమ్ లో కొత్త ఎనర్జీని పుట్టించడానికి కమిట్మెంట్ టీజర్ వచ్చేస్తోందని తెలిపింది.

నవంబర్ 18వ తేదీన లక్ష్మీ కాంత్ దర్శకత్వం వహించిన కెమిట్మెంట్ టీజర్ బయటకి రానుంది. సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్లు ఎలా ఉంటాయన్న విషయమై చూపించబోతున్న ఈ సినిమాలో తేజస్వి చాలా గ్లామరస్ గా కనిపించనుంది. తేజస్వితో పాటు రమ్య పసుపులేటి, ఇంకా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. మరి కమిట్మెంట్ తో అయినా తేజస్వి హిట్ కొడుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news