కేటీఆర్‌ను మెప్పించిన ప‌ల్లెటూరి సింగ‌ర్.. ఫిదా అయ్యామ‌న్న మ్యూజిక్ డైరెక్ట‌ర్లు..!

-

మ‌ట్టిలో మాణిక్యాలు ఎన్నో బ‌య‌ట‌ప‌డుతుంటాయి. అలాంటి మాణిక్యం గురించే ఇప్పుడు మ‌నం మాట్లాడుకోబోయేది. ఆమె ఒక ప‌ల్లెటూరి సింగ‌ర్. అయితేనేం త‌న ట్యాలెంట్‌తో మంత్రి కేటీఆర్‌ను, మ్యూజిక్ డైరెక్ట‌ర్లు త‌మ‌న్‌, దేవి శ్రీ ప్ర‌సాద్‌ల‌ను మెప్పించింది. ఆమెనే మెద‌క్ జిల్లాలోని నారైంగి గ్రామంలోని సింగ‌ర్ శ్రావ‌ణి. ఆమె తెలంగాణ మీద రేలారే రేలారే అనే పాట‌ల‌ను పాడింది.

ప‌ల్లెటూరి సింగ‌ర్

అయితే దీన్ని ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. తెలంగాణలో అద్భుత‌మైన సింగ‌ర్ దొరికింద‌ని, ఆమెకు మీ ఆశీస్సులు, స‌పోర్టు కావాల‌ని కోరాడు. దీంతో ఈ పోస్టుపై కేటీఆర్ స్పందించారు. ఆమె అద్భ‌తమైన సింగ‌ర్ అని ప్ర‌శంసించారు.

అంతే కాదు ఆ పోస్టును మ్యూజిక్ డైరెక్ట‌ర్లు దేవి శ్రీ ప్ర‌సాద్‌, త‌మ‌న్‌ల‌కు ట్యాగ్ చేశారు. ఇక కేటీఆర్ పోస్టుపై వారిద్ద‌రూ స్పందించారు. త‌మ‌న్ ట్వీట్ చేస్తూ శ్రావణిలో అద్భుత‌మైన సింగ‌ర్ ఉంద‌ని చెప్పాడు. అలాగే దేవి స్పందిస్తూ శ్రావ‌ణి వాయిస్‌కు ఫిదా అయ్యాన‌ని చెప్పారు. వారిద్ద‌రూ తాము భ‌విష్య‌త్ లో చేప‌ట్టే ప్రోగ్రామ్‌ల‌లో ఆమెకు త‌ప్ప‌కుండా అవ‌కాశం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఆమెకు వేలాది ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news