దిశా కేసు : అదే నిజమైన న్యాయం….స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 

-

గత నెల 27వ తేదీన హైదరాబాద్ షాద్ నగర్ ప్రాంతంలో యువ డాక్టర్ ప్రియాంక రెడ్డిని నలుగురు నిందితులు ఎంతో కిరాతకంగా అత్యాచారం చేయడంతో పాటు ఆమెను ఎంతో పాశవికంగా హత్య చేసి కాల్చి బూడిద చేయడం జరిగింది. అయితే ఆ దారుణ ఘటన బయటకు వచ్చిన 24 గంటల్లోనే నిందితులైన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆరోజు మధ్యాహ్నం నుండి ప్రియాంకను గమనిస్తూ ఉన్న నిందితులు, ప్లాన్ ప్రకారం ఆమె స్కూటీ పంక్చర్ చేసి,
చివరకు ఆమెతో మాటలు కలిపి, అనంతరం ఆమెను ఈడ్చుకెళ్లి క్రూరంగా అత్యాచారం చేసి ఆపై చంపడం జరిగింది. ఇక ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజల నుండి నిరసన వ్యక్తం అవడంతో పాటు, ఈ మ్యాటర్ కేంద్ర ప్రభుత్వం వరకు చేరింది.

అలానే ఈ ఘటన పార్లమెంట్ ని కూడా కుదిపేసింది. ఇక గత కొద్దిరోజులుగా పోలీసుల రిమాండ్ లో భాగంగా చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను, నేటి తెల్లవారు ఝామున సీన్ రికన్స్ట్రక్షన్ నిమిత్తం షాద్ నగర్ హైవే వద్ద దిశా హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లగా, నిందితులు సడన్ గా పోలీసుల నుండి తుపాకులు లాక్కుని పారిపోవడానికి ప్రయిత్నించారని, కావున వారిని స్పాట్ లో కాల్చి చంపినట్టు ఎస్పీ సజ్జనార్ చెప్పారు.

 

కాగా ఈ దారుణ ఘటన నిందితులు కాల్చివేతపై దేశవ్యాప్తంగా హర్షద్వానాలు మిన్నంటుతున్నాయి. ఇక వారి ఎన్కౌంటర్ పై పలువురు సినిమా సెలెబ్రిటీలు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాసేపటి క్రితం ట్వీట్ చేసారు. దిశా హత్య నిందితులను ఆ విధంగా ఎన్కౌంటర్ చేయడం సరైనదే అని, ఈ విధంగా ఆమెకు నిజమైన న్యాయం జరిగింది అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసారు. ఆయనతో పాటు మరికొందరు సినిమా ప్రముఖులు కూడా ట్వీట్స్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Latest news