‘భీష్మ’ ను పవన్ మెచ్చుకోవడం వెనుక అంత ఆంతర్యం ఉందా….?? 

-

టాలీవుడ్ యువ నటుడు నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ టాక్ తో ప్రస్తుతం దూసుకుపోతూ ఉంది. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అద్భుతంగా కలెక్షన్స్ ని రాబడుతున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. సింగిల్ ఫరెవర్ అంటే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించగా మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు.

ఇక ఈ సినిమా సక్సెస్ పై రెండు రోజుల క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, భీష్మ మూవీ టీమ్ కు అభినందనలు తెలుపగా, నిన్న ఏకంగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో నితిన్, దర్శకుడు వెంకీ, నిర్మాత వంశీలను ప్రత్యేకంగా పిలిపించి మరీ అభినందించారు. అయితే పవన్ వారిని ప్రత్యేకంగా అభినందించడంలో ఒక పెద్ద ఆంతర్యం ఉందని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. నిజానికి రెండు రోజుల క్రితం ఈ సినిమా వీక్షించిన పవన్, దర్శకుడు వెంకీ తో కలిసి కాసేపు ఫోన్ లో మాట్లాడారని, నీదగ్గర మంచి సబ్జెక్ట్ ఉంటె చెప్పు తప్పకుండా సినిమా చేద్దాం అని అన్నట్లు టాక్.

 

అయితే ఆ తరువాత సినిమా యూనిట్ ని పిలిపించి అభినందించిన పవన్, వెంకీ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించారని, కానీ తన వద్ద ప్రస్తుతం కథ సిద్ధంగా లేదని, మీరు టైం ఇస్తే అతి త్వరలో మంచి స్టోరీ తో మీ ముందుకు వస్తానని దర్శకుడు వెంకీ అన్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం పవన్, వెంకీ కాంబోలో మంచి ఎంటర్టైనర్ ని మనం ఆశించవచ్చు….!!

Read more RELATED
Recommended to you

Latest news