పెళ్లంటే నో అంటున్న హీరోయిన్స్ వీళ్ళే..!

-

మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది వయసు మీద పడుతున్నా కూడా ఇంకా వివాహానికి దూరంగానే ఉన్నారు. ఇటీవల కాలంలో చాలామంది కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుతుంటే.. మరికొంతమంది మాత్రం బాలీవుడ్లో సత్తా చాటే ప్రయత్నంలో భాగంగా పెళ్లి అనే పదానికి దూరం అవుతున్నారు. మరి పెళ్లి అంటేనే వద్దు అంటున్న హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే… అనుష్క శెట్టి, శృతిహాసన్, త్రిష, నిత్యామీనన్, చార్మి లాంటి ముద్దుగుమ్మలు 30 సంవత్సరాలు వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోవడానికి సముకత చూపించడం లేదు.

వీరిని ఎవరైనా.. ఎప్పుడు వివాహం చేసుకుంటారు అని అడిగితే నో అని చెబుతున్నారు. మరొక వైపు వీరి అభిమానులు మాత్రం ఎప్పుడు శుభవార్త చెబుతారా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వీరిలో ఛార్మీ మినహా మిగతా వారంతా కూడా తమ కెరియర్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ మధ్యకాలంలో త్రిష పెళ్లి అంటూ కోలీవుడ్ మీడియా నుంచి టాలీవుడ్ మీడియా వరకు వరుస వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆమె మాత్రం సినిమాలలో బిజీగా ఉంది. అయితే గతంలో ఒక బిజినెస్ మాన్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న త్రిష పెళ్లి క్యాన్సిల్ చేసుకుని సినిమాలపైనే దృష్టి పెట్టింది.

మరొకవైపు అనుష్క శెట్టి కూడా సినిమాకు కమిట్ అవ్వకుండా కుటుంబంతో సమయాన్ని గడుపుతోంది. అవకాశాలు వచ్చినా సరే నో చెప్పేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో మాత్రం తెలియకుండా పోయింది. మరొకవైపు నిత్యామీనన్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని చెప్పాలి. పెళ్లి కంటే కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని.. ఫ్యూచర్ కూడా అర్థవంతంగా ఉంటుందని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు ఛార్మీ పెళ్లి ఊసే ఎత్తడం లేదంటే ఇంకొక వైపు శృతిహాసన్ కూడా కెరియర్ పైన ఫోకస్ పెట్టింది. మరి ఈ ముద్దుగుమ్మలు ఎప్పుడు వివాహం చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news