సవ్యసాచిని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు

-

అక్కినేని నాగ చైతన్య హీరోగా టాలెంటెడ్ డైరక్టర్ చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన సినిమా సవ్యసాచి. నవంబర్ 2న రిలీజైన ఈ సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకోగా కలక్షన్స్ కూడా సోసోగానే ఉన్నాయి. చైతుతో ప్రేమమ్ సినిమా చేసిన చందు మొండేటి సవ్యసాచి అంటూ ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా కథ అనుకున్నప్పుడు చైతు కంటే ముందు మరో ఇద్దరు హీరోలను అడిగాడట దర్శకుడు.

మొదట మెగా హీరో వరుణ్ తేజ్ కు ఈ సవ్యసాచి కథ చెప్పాడట. అతను బిజీ షెడ్యూల్స్ వల్ల మాస్ మహరాజ్ రవితేజకు ఈ సినిమా కథ వినిపించాడట. అయితే రవితేజ మాత్రం ఈ కథ చేయనని చెప్పాడట. అలా వరుణ్ తేజ్, రవితేజ రిజెక్ట్ చేసిన సవ్యసాచి కథను నాగ చైతన్య ఓకే చేయడం సినిమా చేయడం జరిగింది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఆ ప్రొడక్షన్ లో తేడా కొట్టిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. మరి చైతు కాకుండా వరుణ్ తేజ్ లేదా రవితేజ ఈ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదో కాని శైలజా రెడ్డి అల్లుడు తర్వాత చైతు ఈ సినిమాతో మరోసారి నిరాశ పరచాడు.

Read more RELATED
Recommended to you

Latest news