చిరు, బాలయ్య అతిథులుగా ట్రిపుల్ ఆర్ లాంచ్

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోతున్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ఈ నెల 11న సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న ఈ మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా ముహుర్త కార్యక్రమానికి ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా ట్రిపుల్ ఆర్ లాంచింగ్ కు ప్రభాస్ గెస్ట్ గా వస్తాడని వార్తలు రాగా లేటెస్ట్ సమాచారం ప్రకారం ట్రిపుల్ ఆర్ ముహుర్త కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరు స్పెషల్ గెస్టులుగా వస్తున్నారట.

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడిగా రాజమౌళి గొప్ప పేరు ప్రఖ్యాతలను అందుకున్నాడు. బాహుబలి సీరీస్ తర్వాత వస్తున్న ఈ మల్టీస్టారర్ కూడా ఆ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమాకు బెస్ట్ విషెస్ అందించేందుకు ఇండస్ట్రీ సీనియర్ హీరోస్ చిరు, బాలయ్య వస్తున్నారట.

వీరితో పాటుగా నాగార్జున, వెంకటేష్ కూడా వస్తే ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్ ఓ సిని పండుగగా జరుగుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఓ పిరియాడికల్ కథగా వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే జక్కన్న వర్క్ షాప్ మొదలు పెట్టగా ప్రస్తుతం మొదటి షెడ్యూల్ నెల రోజుల పాటు ఇంటర్వల్ సీన్ షూట్ చేస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news