మూడేళ్ళుగా సక్సస్ లో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి భారీ షాక్ ..!

-

బాలీవుడ్ లో ఖాన్ త్రయం గురించి అందరికి తెలిసిందే. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లు వరుసగా సినిమాలని చేస్తూ బ్లాక్ బస్టర్ ని అందుకునే వాళ్ళు. కానీ ఈ ముగ్గురికి గత కొంత కాలంగా భారీ ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో ఇప్పుడు ఈ ముగ్గురి హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. అదే సమయంలో మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ గత మూడేళ్ళుగా వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటున్నాడు. ఖాన్ ల త్రయానికి ఈ ఒక్కడే గట్టి పోటీగా నలబడ్డాడు. సామాజిక అంశంతో ఎక్కువగా కథ లని ఎంచుకుంటూ చాలా లిమిటెడ్ బడ్జెట్ తో సినిమాలని తీసి భారీ వసూళ్ళని దక్కించుకుంటున్నారు అక్షయ్ కుమార్ తో సినిమా తీస్తున్న మేకర్స్.

 

స్టార్ అన్న ఇమేజ్ ని పక్కన పెట్టి భారీ బడ్జెట్, పాన్ ఇండియా రేంజ్ సినిమా అనే పోకడలు పోకుండా వరుస బెట్టి సినిమాలని చేసుకుంటూ వెళుతున్నాడు అక్షయ్ కుమార్. టాయిలెట్ ఏక్ ప్రేం కథ, ప్యాడ్ మాన్, జాలీ ఎల్.ఎల్.బి, మిషన్ మంగళ్.. ఇలా భారీ సక్సస్ లను అందుకుంటున్నాడు ఈ కిలాడి హీరో. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ బాలీవుడ్ హీరోకి గట్టి షాక్ పడి మూడేళ్ళుగా కొనసాగుతున్న జర్నీకి బ్రేక్ పడింది. దాంతో అక్షయ్ కుమార్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అన్న ఆలోచనలో ఉన్నారట.

తాజాగా ఈ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా ‘సూర్యవంశీ’ త్వరలో విడుదలకి సిద్దంగా ఉంది. కానీ ఈ సినిమాకి కరోనా ఎఫెక్ట్ తగిలింది. దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని అక్షయ్ కుమార్ బృందం సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 24న విడుదల కావాల్సిఉంది. కానీ, కరోనా ఎఫెక్ట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర విడుదలను వాయిదా వేసి మళ్ళీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని వెల్లడించారు.

దాంతో ఈ సినిమాకి అనుకున్న ప్రమోషన్స్ కూడా ఆపేశారట. అయితే అక్షయ్ కుమార్ ఎంత ప్లాన్స్ వేసుకున్న ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఖాలీగా కూర్చోవడం తప్ప చేయగలిగిందేమి లేదు. ఎందుకంటే ప్రముఖ కొరియో గ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచన రీమేక్ కూడా షూటింగ్ ఆపేశారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నటిస్తుండగా హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news