Veerasimha Reddy : జై బాలయ్య పాటకు తిరుపతి పూజారి స్టెప్పులు..వీడియో వైరల్‌

-

బాలకృష్ణ హీరోగా.. స్టార్ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కించిన చిత్రం వీరసింహారెడ్డి . సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన చాలా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది.

మొదటి షో తోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా యూఎస్ లో కూడా ప్రీమియర్ షో తో సందడి చేస్తోంది. అక్కడ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మాస్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్‌ రచ్చ చేస్తున్నారు.

ఇక తిరుపతిలో వీర సింహారెడ్డి మూవీ సందడి చేసింది. తిరుపతిలోని ప్రతాప్ థియాటర్ లో జై బాలయ్య సాంగ్ కు వృద్ధ బ్రాహ్మణుడు స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news