కొవిడ్ బాధితుల కోసం క‌దిలొస్తున్న టాలీవుడ్ సెల‌బ్రిటీలు

-

ఇప్ప‌టి వ‌ర‌కు సెల‌బ్రిటీల్లో ఎవ‌రైనా కొవిడ్ బాధితుల కోసం సాయం చేస్తున్నారా అంటే కేవ‌లం సోనూసూద్ పేరు మాత్ర‌మే వినిపించేది. దీంతో టాలీవుడ్ హీరోలు, సెల‌బ్రిటీల‌పైన విప‌రీత‌మైన ప్రెష‌ర్ వ‌స్తోంది. మీరెందుకు చేయ‌ట్లేద‌నే డిమాండ్లు అభిమానుల నుంచి వ‌చ్చింది. దీంతో ఒక్కొక్క‌రిగా హీరోలు, డైరెక్ట‌ర్లు ముందుకొస్తున్నారు.

ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఆక్సిజ‌న్ బ్యాంకుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని, దీన్ని రామ్‌చ‌ర‌ణ్ ప‌ర్య‌వేక్షిస్తాడ‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు మరో డైరెక్ట‌ర్ ముందుకొచ్చారు.

డైరెక్ట‌ర్ సుకుమార్ కోన‌సీమ ఏరియాలోని కొవిడ్ పేషెంట్ల‌కు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను అందించేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం రూ.25ల‌క్ష‌లు కేటాయించారు. హీరో సందీప్ కిష‌న్ కూడా క‌రోనా వల్ల అనాథ‌ల‌యిన పిల్ల‌ల‌ను రెండేళ్ల వ‌ర‌కు తానే బాధ్య‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. అటు నిర్మాణ సంస్థ‌లు కూడా హెల్ప్ డెస్క్‌ల‌ను ప్రారంభించి సాయం అందిస్తున్నాయి. ఇది ఎంతైనా టాలీవుడ్‌కు చాలా అవ‌స‌రం. మ‌రింత మంది ముందుకొస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news