బిగ్ న్యూస్ : సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమా ఫిక్స్ అయింది….!!

-

మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాల విజయాలతో మంచి జోష్ మీదున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ హీరోయిన్ విజయశాంతి చాలా ఏళ్ళ తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా మాస్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు మైండ్ బ్లాక్ అనే మాస్ సాంగ్, ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచడం జరిగింది. రాబోయే సోమవారం ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ నటించబోయే తదుపరి 27వ సినిమాపై కొద్దిరోజలుగా పలు వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలన్నిటికీ తెరదించుతూ, ఇటీవల మహేష్ తో మహర్షి వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి, మరొక్కసారి ఆయనతో కలిసి జతకట్టబోతున్నారు. నేడు ఒక ప్రైవేట్ కార్యక్రమం నిమిత్తం సింహాచలం క్షేత్రం విచ్చేసిన వంశీ, తన తదుపరి సినిమా మహేష్ బాబు-దిల్ రాజు గారి కాంబినేషన్లో ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం కథ సిద్ధం అవుతోందని, అతి త్వరలోనే పూర్తి వివరాలు మీడియా వారికి తెలియపరుస్తాం అని ఆయన చెప్పారు. కాగా ఈ సినిమా మహర్షి మాదిరిగా మెసేజ్ సినిమా కాదని, ఇది ఒక గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగె మాస్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. మరి ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మహర్షి సూపర్ హిట్ కొట్టి ఉండడంతో, ఈ సినిమాపై కూడా అంచనాలు మరింతగా ఉన్నాయి. కాగా ఈ సినిమా విషయమై అతి త్వరలో పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడనుంది……!!

Read more RELATED
Recommended to you

Exit mobile version