ప్రేమికుల రోజు మొదలుపెడతారట..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమా త్రివిక్రంతో కన్ఫాం చేశాడు. న్యూ ఇయర్ కానుకగా ఈ కాంబో సినిమా ఎనౌన్స్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు త్రివిక్రం అండ్ బన్ని. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతుంది. ఇక ఈ సినిమా ముహుర్తం ఎప్పుడన్నది ఫిక్స్ చేశారట. వాలెంటైన్స్ డే నాడు అంటే ఫిబ్రవరి 14న త్రివిక్రం, బన్ని సినిమా మొదలు పెడుతున్నారట.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ క్రేజీ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ తోనే వస్తుందట. కియరా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. వాలెంటైన్స్ డే నాడు మొదలు పెడుతున్నారంటే ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

డైరక్టర్ విక్రం కుమార్, పరశురాం ఇద్దరు బన్నికి సరిపోయే కథ సిద్ధం చేసినా ఈసారి అదిరిపోయే హిట్ అందుకోవాలన్న ఉద్దేశంతో బన్ని ఈ సినిమా చేస్తున్నాడు. మరి త్రివిక్రం, బన్ని మరోసారి మ్యాజిక్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news