గీత మీద కన్నేసిన త్రివిక్రం..!

-

మాటల మాంత్రికుడు త్రివిక్రం అరవింద సమేత తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. బన్నితో ఆల్రెడీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్ కొట్టిన త్రివిక్రం ఈసారి హ్యాట్రిక్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ కథతో వస్తుందని అంటున్నారు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే నాడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందట.

ఈ సినిమా పీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి కాగా హీరోయిన్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదట. ముందు కియరా, కీర్తి సురేష్ లాంటి పేర్లు వినిపించినా ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ కు రష్మిక అయితే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. కన్నడ నుండి వచ్చిన రష్మిక తెలుగులో ఛలో సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ అయ్యింది. దేవదాస్ సినిమాలో చేసినా ఆ సినిమాలో తన పోర్షన్ తక్కువ కాబట్టి ఆ సినిమా నిరాశపరచినా అమ్మడి కెరియర్ కు ఏమాత్రం ఎఫెక్ట్ చూపలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక త్రివిక్రం, బన్ని సినిమాలో సెలెక్ట్ అయితే మాత్రం అమ్మడి క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news