నాని, సాయి పల్లవి మరోసారి… ఒకే ఒరలో రెండు కత్తులు…!

-

నేచురల్ స్టార్ 2020 లో చాలా ప్లాన్ వేసుకున్నాడు. గత కొంతకాలంగా వరస ఫ్లాపులతో సతమతమవుతున్న నాని గత ఏడాది జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలలో హిట్స్ అందుకోవాలనుకున్నప్పటికి ఈ రెండు సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి. అయినా నాని మినిమం గ్యారెంటీ హీరో కాబట్టి మేకర్స్ క్యూ కడుతూనే ఉన్నారు. వరస ఫ్లాప్స్ తో కోల్పోయిన ఫాం ని మళ్ళీ తిరిగి సాధించాలన్న కసితో 2020 లో ఏకంగా మూడు ప్రాజెక్ట్స్ ని కమిటయి ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అయ్యోలా ప్లాన్స్ చేసుకున్నాడు.

 

ముందుగా నాని దిల్ రాజు మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో సినిమా కంప్లీటయి రిలీజ్ కి సిద్దంగా ఉంది. “వి” టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్, సుధీర్, అదితీ రావు హైదరీ కూడా నటిస్తుండగా జూలై లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాని శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమా కూడా రిలీజ్ డేట్ మారనుంది.

ఇక ఈ సినిమాతో పాటు టాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా ప్రతిభ ని చాటుకున్న రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించే సినిమాలో నటించబోతున్నాడు నాని. ఈ సినిమా వాస్తవంగా అయితే డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కాని ఇప్పటివరకు షూటింగ్ కూడా మొదలవలేదు. అయితే ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి ని హీరోయిన్ గా అనుకుటున్నారు. దాంతో ఇద్దరు కత్తులాంటి వాళ్ళు ఒకే ఒరలో ఎలా ఇమడగలరు అన్న టాక్ మొదలైంది.

అందుకు కారణం ఇద్దరు కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవరు అని చెప్పుకోవడమే. ఇంతకముందు కూడా వీళ్ళిద్దరు ఎం.సి.ఏ లో కలిసి నటించారు. ఆ సమయంలో కొన్ని సీన్స్ విషయంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తాయి. నిర్మాత కలగజేసుకోవడం తో అవి సద్దుమణిగాయి. అయితే ఇప్పుడు కూడా అలాంటి సమస్యలు వస్తాయా అన్న చర్చ జరుగుతోంది. అందుకే మేకర్స్ మరో హీరోయిన్ ని కూడా అనుకుంటున్నట్టు తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news