దుబాయ్​లో ఉపాసన సీమంతం.. భార్యతో రామ్ చరణ్ రొమాంటిక్ పోజులు

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి వెకేషన్​లో ఉన్నారు. ఈ జంట తమ బేబీమూన్​ కోసం దుబాయ్ వెళ్లింది. త్వరలోనే ఈ కపుల్ తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలకనున్న వేళ.. దుబాయ్​లో ఉపాసన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెకు సీమంతం ఏర్పాటు చేశారు. సముద్రపు ఒడ్డున జరిగిన ఈ బేబీషవర్ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్​లో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటి వరకు ‘ఆర్​ఆర్​ఆర్​’ ప్రమోషన్స్​తో పాటు ఆర్​సీ15 షూటింగ్​లో బిజీగా ఉన్న చరణ్ ప్రస్తుతం తన టైం అంతా భార్య ఉపాసన, పుట్టబోయే బిడ్డకు కేటాయిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ జంట దుబాయ్​ వెకేషన్ ఎంజా చేస్తోంది. ఇక బేబీ షవర్​ ఫొటోషూట్​లో చరణ్ తన భార్యతో కలిసి రొమాంటిక్ పోజులిచ్చాడు.

సముద్రపు ఒడ్డున సాయంకాళం వేళ దిగిన ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో చెర్రీ,ఉప్సీల జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఉపాసన తన బేబీషవర్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. తన సిస్టర్స్​కు థాంక్యూ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news