మెగా ఫ్యామిలీ నుంచి`ఉప్పెన` లా వ‌స్తున్న మ‌రో హీరో

-

హీరో సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ సంస్థతో కలిసి దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సుకుమార్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ ప‌తాకాల‌పై సినిమా రూపొందుతుంది.

సోమ‌వారం(అక్టోబ‌ర్ 21) నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను పూరితో పాటు కోల్‌క‌తా, గ్యాంగ్‌ట‌క్ ప్రాంతాల్లో చిత్రీక‌రించ‌నున్నారు. 20రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ నున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ కానున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పరువు హత్యల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news