BREAKING : వాణి జయరామ్ పోస్టుమార్టం పూర్తి.. తలపై గాయం గుర్తింపు

-

చిత్ర పరిశ్రమ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు మరణించగా తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ వాణి జయరాం మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాణి జయరాం.. నిన్న మృతి చెందారు. ఈమె చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కాసేపటికి క్రితమే అధికారికంగా ప్రకటించారు.

అయితే, నిన్న కన్నుమూసిన ప్రముఖ గాయని జయరామ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. తలపై ఒకటిన్నర ఇంచు గాయం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారు. అయితే ఇది ఎలా అయింది అన్న దానిపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై క్లారిటీ ఇస్తామని చెప్పారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం వాణి జయరామ్ అంత్యక్రియలు పూర్తికానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news