క్రేజీ న్యూస్.. రోజాని మిస్ చేసుకున్న వెంకీ..!

-

విక్టరీ వెంకటేష్ ఏంటి రోజాని మిస్ చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. మణిరత్నం సినిమాలో అరవింద్ స్వామి హీరోగా వచ్చిన సినిమా రోజా. ఆ సినిమాలో హీరోగా ముందు వెంకటేష్ ను అనుకున్నారట. ఆ ఛాన్స్ రాగానే ఎక్సైటింగ్ గా ఫీలైనా తన చేయి విరగడం వల్ల ఆ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నా అని చెప్పుకొచ్చాడు వెంకటేష్. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన ఎఫ్-2 సినిమా 12న రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో రోజా సినిమా మిస్సైన విషయాన్ని ప్రస్థావించారు వెంకటేష్. ఆ సినిమా చేసుంటే బాలీవుడ్ వైపు వెళ్లే వాడినేమో అంటూ మాట్లాడారు. ఆ సినిమా వదులుకున్న వెంకీ సుందరాకాండ సినిమా చేశాడు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది అయితే తనకి ఫ్యామిలీ హీరోగా ముద్ర పడిందని అంటున్నరు వెంకటేష్. అమితాబ్, ఆమీర్ ఖాన్ లా తాను ప్రయోగాలు చేయాలని ఉంటుందని కాని ఆ కథలు తన దగ్గర రావాలి కదా అన్నారు వెంకటేష్.

Read more RELATED
Recommended to you

Latest news