టివి -5 జర్నలిస్ట్ 5 కోట్ల డిమాండ్.. వేడుకుంటున్న వేణుస్వామి దంపతులు..!

-

గత కొన్ని రోజులుగా వేణు స్వామి… మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వేణు స్వామి జాతకం చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పిన జాతకం ప్రకారం అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత విడిపోతారని స్పష్టం చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు… వేణు స్వామిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే వేణు స్వామి అలాగే ఆయన భార్య శ్రీవాణి సంచలన వీడియో బయటకు రిలీజ్ చేయడం జరిగింది.

venu swamy comments on tv 5 murthy

జర్నలిస్టు మూర్తి ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు వేను స్వామి దంపతులు. టీవీ ఫైవ్ మూర్తి 2017 నుంచి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో టీవీ ఫైవ్ మూర్తి అడిగిన డబ్బు తాము ఇవ్వలేదని తెలిపారు. దీంతో గత ఎనిమిది నెలలుగా… ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని వేధింపులు చేస్తున్నట్లు కూడా ఈ వీడియోలో తెలిపారు. ఆ డబ్బులు ఇచ్చుకొని పరిస్థితిలో తాము ఆత్మహత్యకు నిర్ణయం తీసుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో పెట్టినందుకు వాళ్లు మమ్మల్ని చంపేస్తారని కూడా బాంబు పేల్చారు. ఎవరైనా టీవీ5 మూర్తి గ్యాంగ్ నుంచి తమల్ని కాపాడాలంటూ… ఈ వీడియో రిలీజ్ చేశారు వేణు స్వామి దంపతులు.

Read more RELATED
Recommended to you

Latest news