చిత్ర పరిశ్రమలో విషాదం..గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

ప్రముఖ నటుడు రమేష్‌ డియో మరణించారు. నిన్న అర్ధరాత్రి గుండెపోటు రావడంతో.. రమేష్‌ డియో మరణించినట్లు సమాచారం అందుతోంది. గుండె పోటు రావడంతో.. వెంటనే స్థానిక ఆస్పత్రికి ఆయనను తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో.. రమేష్‌ డియో మరణించారు. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయనకు 93 ఏళ్లు. బాలీవుడ్‌ లో చాలా మూవీస్‌ లో ఆయన నటిం చారు. ఆనంద్, ఆప్ కీ కసమ్ వంటి చిత్రాలలో నటించారు. ఇక ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news