ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా.. ఇవాళ ఒక్కరోజే 1.72 లక్షల కేసులు నమోదు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,72,433 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,18,03,318 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,33,921 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.60 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 1008 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,98,983 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,97,70,414 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,96 కోట్ల కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 167.87 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇండియాలో రోజు వారీ కేసుల శాతం 10.99 శాతంగా నమోదు కాగా… నిన్నటి కంటే.. 6.8 శాతం కరోనా కేసులు ఎక్కువగా పెరిగి పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news