‘అర్థమైందా రాజా..’ అంటూ.. జైలర్ ప్రమోషన్స్ లో తలైవా పవర్ ఫుల్ స్పీచ్

-

సూపర్ స్టార్ రజనీకాంత్ కు గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. తలైవా సినిమాలు వచ్చినట్టే వచ్చి మాయమైపోతున్నాయి. ఈ క్రమంలో రజనీ లేటెస్ట్ మూవీ తలైవా పైనే ప్రేక్షకుల ఆశలన్నీ ఉన్నాయి. భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నందున ఈ మూవీపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు రజనీకాంత్.

ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. ఇటీవల ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక చెన్నైలో నిర్వహించారు. ఈ వేడుకలో తలైవా తన పవర్ ఫుల్ స్పీచ్.. హావభావాలు.. డైలాగ్స్ తో ప్రేక్షకులను ఫిదా చేశారు. ‘‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా..’’అంటూ తన లైఫ్ లో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ పలికిన మాటలకు ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అలాగే దుర్యోధనుడి పాత్ర గురించి హావభావాలు పలికిస్తూ చెప్పిన డైలాగ్‌ కూడా చప్పట్లు కొట్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news