విరాట‌ప‌ర్వం ఓటీటీలోనా లేక థియేట‌ర్ల‌లోనా? ఏది బెట‌ర్‌!

-

టాలీవుడ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు క‌రోనా కార‌ణంగా విడుద‌ల‌ను వాయిదా వేస‌కున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ల‌వ్ స్టోరీ, విరాట‌ప‌ర్వం, ఆచార్య‌లాంటి సినిమాలు రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకున్నాయి. రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న విరాట‌ప‌ర్వం ఏప్రిల్ 30నే విడుద‌ల కావాలి.

కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో విడుద‌ల చేయాల‌ని చూస్తోంది మూవీ టీం. ఇప్ప‌టికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.30కోట్ల‌కు పైగా ఆఫ‌ర్ చేసింద‌ట‌. అయితే మూవీపై భారీ అంచ‌నాలు ఉండ‌టంతో ఆలోచ‌న‌లో ప‌డింది మేక‌ర్స్ టీం.

థియేట‌ర్లలో అయితే రూ.45కోట్ల వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఎందుకంటే న‌క్స‌ల్స్ బ్యాక్ గ్రౌండ్‌లో ఈ మ‌ధ్య సినిమాలు రాలేదు. ఇది కొత్త కాన్సెప్ట్ కావ‌డం, ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ఫొటోలు విప‌రీతంగా అంచ‌నాలు పెంచేశాయి. దీంతో థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాలా లేక ఓటీటీలోనే విడుద‌ల చేయాలా అనే సందిగ్ధంలో ఉంద‌ట మూవీ టీం.

Read more RELATED
Recommended to you

Latest news