ప్రభాస్ లాంటి కటౌట్ తో రొమాన్స్ అంటే ఏ హీరోయిన్ వద్దంటుంది …?

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డేలు జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘జాన్’ అని చిత్ర బృందం ముందునుంచి ప్రచారం చేసినప్పటికి ఆ తర్వాత ఈ సినిమా టైటిల్ ‘ఓ డియర్’ అని ‘రాధే శ్యామ్’ అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ రెండిటిల్లో ఒకటి ఫైనల్ చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా ‘జిల్’ సినిమా ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయి.

 

కొన్నాళ్ళు పూజా హెగ్డే కి ఆరోగ్యం సహకరించకపోవడం తో షూటింగ్ కి బ్రేక్ పడితే ఇప్పుడు కరోనా కారణంగా బ్రేక్ పడింది. సాహో అనుకున్నట్టుగా సక్సస్ కాకపోవడంతో ఈ సినిమాని ఎన్నో ఆశలు, జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కిస్తున్నారు. కథ లో కాడా కొన్ని మార్పులు చేస్ర్పులు చేసి కొంత గ్యాప్ తర్వాత షూటింగ్ మొదలు పెడితే కరోనా కారణంగా విదేశాల కు వెళ్ళిన ప్రభాస్ టీం తిరిగి వెనక్కి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో మార్కెట్ సెట్ వేసి చిత్రీకరించి కరోనా నేపథ్యంలో మధ్యలోనే షూటింగ్ ఆపేసి ఇండియాకి తిరిగి వచ్చారు. ఇక ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ చేయాలంటే అయ్యోపని కాదని అర్థమైపోయింది.

ఈ పాన్ ఇండియా సినిమా ప్రభాస్ అభిమానులకు పండగలా ఉండబోతుందని పూజ హెగ్డే వెల్లడించింది. ప్రభాస్ ని ఇంతవరకు చూడని స్టైల్ తో – బాడీ లాంగ్వేజ్ తో చూపించనున్నాడు డైరెక్టర్ రాధాకృష్ణ. ప్రతీ ఫ్రేమ్ లో ప్రభాస్ విజువల్ వండర్ గా కన్పిస్తాడు. త్వరలో తెరకెక్కించనున్న షెడ్యూల్ లో ప్రభాస్ కి – నాకు బ్యూటిఫుల్ రొమాన్స్ ని షూట్ చేయనున్నారని తెలిపింది. అంతేకాదు ప్రభాస్ తో రొమాంటిక్ సీన్స్ అంటే ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటు వెల్లడించింది. ఇక ప్రభాస్ లాంటి కటౌట్ తో రొమాన్స్ అంటే ఏ హీరోయిన్ వద్దంటుంది …అంటూ చిలిగాను మాట్లాడింది. మొత్తానికి పూజా హెగ్డే వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ కి జోష్ పెరిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news