డబ్బు కోసం ఏమైనా చేస్తుంది.. శ్యామలపై నెటిజన్ షాకింగ్ కామెంట్.!

-

సాధారణంగా ఏ ఒక్కరైనా సరే డబ్బు కోసమే పని చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే… అది తెలిసినా సరే చాలామంది ఏదో ఒక విషయంలో వారిని ఏకీపారేస్తూ ఉంటారు.మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడంలో చాలామంది నెటిజన్స్ అదే పనిబడిగా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఎవరైనా సెలబ్రిటీలు డబ్బుల కోసం ఏ పాత్రలో చేయడానికి అయినా సిద్ధపడితే కచ్చితంగా వారిని డబ్బుల కోసం ఏదైనా చేస్తుంది లేదా చేస్తాడు అంటూ ఏకిపారేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడా ఇలా డబ్బుల కోసం చేయకూడని పనులు కూడా చేసి అందరితో మాటలు కూడా పడ్డారు.

అంతేకాదు ఆరోగ్యాలను దెబ్బతీసే కొన్ని ప్రోడక్ట్ ల గురించి కూడా ప్రకటించిన వాళ్లు కూడా ఉన్నారు. అందుకే సెలబ్రిటీలను డబ్బుల కోసం ఏమైనా చేస్తూ ఉంటారు అని కొంతమంది నెటిజన్లు బాగా విమర్శిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా యాంకర్ శ్యామల కి కూడా ఇదే ఎదురయ్యింది. శ్యామల కూడా డబ్బు మనిషే అంటూ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ బుల్లితెర యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్యామల ఈమధ్య కాలంలో సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటోంది.

మరొకవైపు బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. పలు షో లకు యాంకరింగ్ చేస్తూ కొన్ని అడ్వటైజ్మెంట్లలో కూడా నటిస్తోంది. ఇక ఇదంతా పక్కన పెడితే గతంలో రాజకీయ పరంగా కూడా ఒక పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కెరియర్ పరంగా బిజీగా ఉండడంతో రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఆమె కొన్ని ఫోటోలు పంచుకోగా.. వాటిని చూసిన ఒక నెటిజన్.. ఎలక్షన్స్ ముందు వైసీపీ జెండా పట్టుకొని తిరిగావు ఇప్పుడు ఏమైంది అని అడగగా.. మరొక నేటిజన్ డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు. ఎక్కడైనా తిరుగుతారు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news