వామ్మో.. అనసూయ కు ఆ దోషం వల్లే ఇలా జరుగుతోందా..?

-

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు. ఈమె మొదట ఒక న్యూస్ ఛానల్ లో న్యూస్ రిపోర్టర్ గా కూడా పనిచేసింది. ఇక జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో పలు సినిమాలలో పలు పాత్రలలో నటిస్తూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది అనసూయ. అనసూయ ఇద్దరు పిల్లల తల్లి అయిన కూడా అందంలో మాత్రం హీరోయిన్లను మించిపోయి ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తూ ఉంటోంది అనసూయ.

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ను కూడా విడవడం జరిగింది. అంతేకాకుండా పలు వివాదాలలో కూడా చిక్కుకుంటూ ఉంటోంది. సోషల్ మీడియాలో అనసూయ ఏం షేర్ చేసిన కూడా తిరిగి ఆమెకు ఊహించని స్థాయిలో కౌంటర్లు వెళ్ళబడుతున్నాయని చెప్పవచ్చు. ఎన్నోసార్లు అలాంటి విషయాలపై బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటోంది. అయితే అనసూయకు ఇలా జరగడానికి ముఖ్య కారణం ఆమె జాతకంలో ఏదో దోషం ఉందంటూ పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

అంతేకాకుండా అనసూయ ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం అనసూయ యాంకర్ గా కూడా ఎలాంటి షోలలో కనిపించలేదు అందుచేతనే ఈమెకు ఏదో దోషం ఉందంటు పలువురు నేటిజెన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్తలపై అనసూయ ఎలా రియాక్షన్ ఇస్తుందో చూడాల్సి ఉంది. అనసూయ పుష్ప-2 చిత్రంలో నటిస్తూ ఉన్నది. అనసూయ అభిమానులు మాత్రం ఆమెని బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇవ్వమని పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం చేజేతులారా అనసూయ కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల తన కెరీర్ ని నాశనం చేసుకుంటోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news