పుష్ప -2 లో సాయి పల్లవి బదులు యంగ్ హీరోయిన్..!!

-

తెలుగు సినీ పరిశ్రమలో సినీ నటుడు అల్లు అర్జున్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు అల్లు అర్జున్. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇక దీంతో పుష్ప-2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డారు చిత్ర బృందం. ఈ సినిమాని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తున్నది.

అంతేకాకుండా ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు మరింత హైలెట్ గా ఉండేందుకు కొంతమంది నటీనటులను ఎంపిక చేసుకునే విధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలా గడిచిన కొద్ది రోజుల క్రితం హీరోయిన్ సాయి పల్లవి తీసుకోబోతున్నారని వార్తలు చాలా వైరల్ గా మారాయి. సుకుమార్ కథ చాలా స్ట్రాంగ్ గా ఉండేందుకు స్క్రిప్టులో రెండవ హీరోయిన్గా ఈమె పాత్రను ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈమె నటిస్తుందా లేదా అన్న విషయంపై మాత్రం ఇంతవరకు చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు ఇదే పాత్రకి మరొక యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇందులో ఒక గిరిజన యువతి పాత్ర కీలకంగా ఉంటుందట. ఈ పాత్ర కోసం మొదట సాయి పల్లవి పేరు బాగా వినిపించింది. కానీ ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ పేరు బాగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఈ పాత్ర ఎవరికైనా సరే ఖచ్చితంగా సూట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే సాయి పల్లవి తనకు ఎలాంటి పాత్ర నచ్చినా అది చిన్నదా పెద్దదా తేడా లేకుండా నటిస్తుంది. అయితే ఇందులో అసలు సెకండ్ హీరోయిన్ పాత్ర ఉందా లేదా అనే విషయం పైన చిత్ర బంధం క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news