అన్‌స్టాపబుల్‌ 2 నుంచి క్రేజీ అప్‌డేట్‌.. బాలయ్య షోకి YS షర్మిల?

-

వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా నందమూరి బాలకృష్ణ జోష్ డబుల్ స్పీడ్ తో సాగుతోంది. బాలయ్య బాబు హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షో సీ జన్ 1 దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సీజన్ 1కి వచ్చిన రెస్పాన్స్ తో నిర్వాహకులు సీజన్ 2ను స్టార్ట్ చేశారు.

ఇక ప్రస్తుతం అనిష్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఫిలింనగర్ లో జోరుగా ప్రచారం అవుతోంది. ఇప్పటివరకు సీజన్ 2 కి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ , విశ్వక్సేన్, జొన్నలగడ్డ సిద్దు, తాజాగా ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి శర్వానంద్ మరియు అడవి శేషు గెస్ట్లుగా రానున్నారు. ఇక తర్వాత ఎపిసోడ్ కి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె తెలంగాణ వైసిపి పార్టీ అధినేత వైఎస్ షర్మిల గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం అందుతుంది. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news