నారాయణుడు మత్స్యావతారం దేనికోసం ఎత్తాడో మీకు తెలుసా?

-

నారాయణుడి దశావతారాలు అందరికీ తెలుసు. ప్రతి అవతారం వెనుకు విశేష రహస్యాలు ఉన్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్ధము భగవంతుడు అనేక అవతారాలు దాల్చుతాడు. ఆ అవతారాల్లోకెల్లా, దశావతారాలు చాలా ప్రముఖ్యాన్ని పొందాయి. ఆ పదింటిలోనూ మత్స్యావతారానికి బహుదా విశేషత్వం ఉంది. ఆది అంటే మొట్టమొదటి అవతారమే మత్స్యావతారం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు. వీరిలో విశ్వరచన అంతా బ్రహ్మదేవుడు చేస్తాడు. సకల విజ్ఞానానికి విశ్వసృష్టికి ఆయనే మూల పురుషుడు. పూర్వం శ్రీహరి యోగనిద్రలో ఉన్న సమయంలో చేతిలోని శంఖము జారి ప్రళయ జలాల్లో పడి పోయింది.

ఆ శంఖం నుండి ఒక రాక్షసుడు జన్మించాడు. అతడే శంఖాసురుడు. శంఖా సురుడి సోమకుడు అని పేరు కూడా ఉంది. పెద్ద శరీరం కలిగిన సోమకుడు అని పేరు కూడా ఉంది. పెద్ద శరీరం కలిగిన సోమకుడు ఆకలి బాధతో అరుస్తూ వివిధ చోట్ల వెదుకుతూ చివరకు బ్రహ్మదేవుడిని సమీపానికి వచ్చి బ్రహ్మనే మింగే ప్రయత్నం చేయసాగాడు. దీని నుంచి బ్రహ్మ తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఆయన తొడపై ఉన్న వేదకోశము కాస్తా కిందపడింది. వెంటనే ఆ వేదాన్ని సోమకుడు సముద్రము అడుగుకు తీసుకు వెళ్లాడు. మనలో కూడా జ్ఞానం ఉంది. కాని మనం విషయాశక్తుల మైనప్పుడు ఆజ్ఞానం మరుగునపడింది. కాని మనం విషయా శక్తులమైనప్పుడు ఆ జ్ఞానం మరుగునప డుతుంది. ఒక్కోసారి తెలిసి కూడా ఏమిటో చేసే సాము దీన్ని, అని చేసిన తరువాత పని గురించి చింత మనకు కలుగుతుంటుంది. ఎప్పుడయితే మానవుడు అప్రమత్తంగా ఉండడో మాయ అనే రాక్షసుడు మన జ్ఞానాన్ని మరుగున పరుస్తాడు. దాని వలన విచక్షణా శక్తిని కోల్పోవడం జరుగుతుంటుంది.

సృష్ట చేయడానికి ఆధారమైన వేదకోశము, రాక్షసుడు తీసుకుని పోవడంతో బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి విషయంవివరించాడు. వేదములు లేకపోతే సృషఫ్టి చేయడం సాధ్యం కాదని కావడం లేదని చెప్పాడు. ఎప్పుడయితే మన జ్ఞానం మాయ చేతి చిక్కుతుందో మనం భగ వంతుని ఆశ్రయిస్తే మనకు తిరిగి భగవదను గ్రహం వలన జ్ఞానం మాయ నుంచి బయటకు వస్తుంది. అని దీని వలన మనకు తెలుస్తుంది. శ్రీమహావిష్ణువు మత్స్యావతారమును ధరించి చక్రము, గదలను ఆయుధాలుగా ధరించి సముద్రంలోకి ప్రవేశించాడు. దినదినానికి శరీరం పెరుగుతూ ఉండగా రాక్షసుడిని వెదకసాగాడు. సోమకుడు మత్స్యావతారంలోని శ్రీ మహావిష్ణు వుని చూసి తనకు ఆహారం దొరికిందని సంతోషంచి శ్రీహరిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన శ్రీమన్నారాయణుడు నీవు మూర్ఖుడవు. నీవు జన్మిస్తూనే నా శంఖం ను, బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదములను మింగి తివి. వాటిని నాకు ఇచ్చి వేయుము. నిన్ను క్షమిం చి వదిలివేస్తాను. లేదా నిన్ను సంహరిస్తాను అని పలికాడు. నీవు ఎవరు?నీరూపు వింతగా ఉంది.

నీ చేతులలో ఉన్నవి ఏమిటి? నాకు చాలా రోజుల నుంచి ఆహారంలేక అలమటిస్తున్నాను. నిన్ను ఇప్పుడే మింగుతాను అంటూ సోమకుడు మత్స్యావతారంలో ఉన్న శ్రీహరిపై దూకే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో మత్స్యమూర్తి తన చేతిలోని చక్రముతో సోమకుడి శిరస్సును ఖండించి తన శంఖమును తీసుకొనడంతో పాటు వేదములను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి ఇవ్వడంతో, బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినట్లు పురాణకథనం. ఈ విధంగా సోమకాసురుడిని అంతమొందించి సృష్టి నిరంతరాయంగా సాగేందుకు శ్రీమన్నా రాయణుడు మత్స్యాతారం ఎత్తినట్లు పురాణ కథనం. మత్స్యపురాణం ద్వారా మనం కూడా మనలోని అజ్ఞానాన్ని పారద్రోలడంలో భగవం తుని సాయం తీసుకుని భగవదాశ్రయంలో చిత్త వికారాన్ని పోగొట్టుకొని నిర్మల చిత్తులమై విచక్షణా శక్తితో మానవ కల్యాణకారమైన పనులను చేసి భగవంతుడి ఆశీస్సులను పొందాలి అనేదాన్ని గ్రహించాలి.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news