సూర్యాస్తమయం తరువాత ఈ పనులు చేస్తే ఆ ఇంటికే దరిద్రమా..?

-

మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు వస్తూనే ఉంటాయి. సూర్యాస్తమం తర్వాత ఈ పనులు చేయడం వల్ల ఆ ఇంటికి అశుభం కలుగుతుందని పురాణ గ్రంథాలలో తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా మన పూర్వీకులు కూడా సూర్యాస్తమం తర్వాత ఇలాంటి పనులు చేయకూడదని కోన్ని సార్లు హెచ్చరిస్తూనే ఉంటారు. సాయంత్రం వేళ ఎవరు నిద్రపో కూడదని, ఇంటిని తుడుచుకో కూడదని కూడా పిల్లలకు చెబుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్లి పోతుందని తెలియజేస్తూ ఉంటారు.అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీ దేవి, సరస్వతి, దుర్గాదేవి సాయంత్రం వేళలో అందరి ఇళ్ళలోకి వస్తూ ఉంటారని తెలియజేయడం జరిగింది అలాంటి పరిస్థితులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). ప్రతి పనికి కూడా సరైన సమయం అనేది ఉంటుంది అటువంటి పరిస్థితులలో మనం మంచి అలవాట్లు కూడా కలిగి ఉండాలి. ఆ తరువాతే పనులు కూడా చాలా సరైన సమయంలో పూర్తి అవుతాయి ఎక్కువమంది సాయంత్రం వేళ నిద్ర పోతూ ఉంటారు జ్యోతిష్యం ప్రకారం ఈ సమయంలో నిద్రపోవడం చెడు గా పరిగణిస్తారు. ముఖ్యంగా ఆయుష్షు తగ్గడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి వీటి ద్వారా లక్ష్మీదేవి కూడా ఇంటిలోకి ప్రవేశించదట.

2). సూర్యాస్తమయం తర్వాత ఇంటిలో ఉడ్చకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఒకవేళ ఆ ఇంటిని ఊడిస్తే ధన నష్టం కూడా కలుగుతుందట.

3). ముఖ్యంగా మహిళలు కాని పురుషులు కాని సాయంత్రం వేళ ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు అలా చేయడం ఆ ఇంటికి అశుభం అని భావిస్తారు.

4). ఇక సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టు ను ఏ విధంగా తాగడం అశుభం గా పరిగణిస్తారు ఈ సమయంలో తులసి మొక్కకు నీటిని కూడా పోయకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news