తొమ్మిది రాత్రులు.. తొమ్మిది రంగులు ప్రత్యేకత ఇదే !

-

దసరా నవరాత్రులు.. తొమ్మిది రాత్రులు.. తొమ్మిది విశేషాలు. అమ్మను త్రిశక్తి స్వరూపంగా.. సకల శక్తిరూపిణిగా ఆరాధిస్తారు. దేశంలో అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలలో అనేక విశేషాలు.. వాటిలో నైవేద్యాలు, పూజలు, రంగులు, మంత్ర, తంత్ర విశేషాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం రంగుల కథ తెలుసుకుందాం…
దసరా నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. నవరాత్రులలో అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తారు.

మొదటి రోజు: శైలపుత్రిగా దుర్గమ్మను ఆరాధిస్తాం. ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. పసుపు రంగు పవిత్రకు..శుభానికి..వెలుగురు ప్రతీక. అమ్మవారు మహిలను నిత్య సుమంగళిగా ఉండేలా దీవించమని వేడుకుంటూ పసుపు రంగు దుస్తులు ధరిస్తారు.
రెండో రోజు : బ్రహ్మచారిణిగా కొలుస్తాం. ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలి. కొందరు బాలా త్రిపురసుందరీగా లేత గులాబీ రంగులో కూడా కొలుస్తారు.
మూడో రోజు: చంద్రఘంట. బూడిద రంగు దుస్తులు ధరించాలి.
నాలుగో రోజు : కూష్మాండ దేవిగా కొలుస్తాం. నారింజ రంగు.
ఐదవ రోజు: స్కందమాత. తెలుపు వర్ణంలో ఉన్న వస్త్రాలు వేసుకుంటే మంచిది.
ఆరవ రోజు: కాత్యాయనీ మాతగా ఆరాధించాలి. ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.
ఏడవ రోజు: కాళరాత్రి అవతారంతో ఈ రోజున నీలం రంగు దుస్తులు వేసుకోవాలి.
ఎనిమిదో రోజు: మహాగౌరీ మాతగా దుర్గమ్మని గులాబీ రంగు వస్త్రాల్లో కొలవాలి.
తొమ్మిదవ రోజు: చివరి రోజున సిద్ధి ధాత్రి అవతారంలో అమ్మవారు ఊదారంగు చీర కట్టుకుని పూజలందుకుంటుంది. భక్తులు కూడా ఊదారంగు దుస్తులే వేసుకుంటే సర్వవిధాలా శ్రేష్టం అని పురాణాలు చెబుతున్నాయి.
అయితే ఆయా ప్రాంతాలలో కొంత మార్పులు ఉంటాయి. కానీ అమ్మవారి ఆరాధన చేయడం మాత్రం అన్ని ప్రాంతాలలో దాదాపుగా సమానంగా చేస్తారు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news